telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రేపు నెల్లూరు జిల్లాకు జగన్.. బ్యారేజ్ లు జాతికి అంకితం ఇవ్వనున్న సీఎం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు సీఎం.

అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.

ఈ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. అక్కడ సంగం బ్యారేజీని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మంగళవారం వైఎస్ జగన్ షెడ్యూల్ ఇలా ఉంది..

*6వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్

*10.40 గంటలకు సంగం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు.

* 11 గంటల నుంచి 1.10 వరకూ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించి, అక్కడే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.

* 1.20 గంటలకు సంగం నుంచి బయదేరి 1.45 కు నెల్లూరు బ్యారేజి సైట్ కు చేరుకోనున్న సీఎం జగన్.

*1.50 గంటల నుంచి 2.20 గంటల వరకూ నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్న సీఎం జగన్.

* 2.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్

Related posts