telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ పాలనలో కలుషిత వాతావరణం: టీడీపీ నేత కోడెల

kodela shivaprasad

వైసీపీ పాలనలో రాష్టం కలుషితంగా మారిందని మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ మండిపడ్డారు. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నడుస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఊళ్లు వదిలి పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో కోడెల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ్ పల్నాడు , సేవ్ డెమోక్రసీ నినాదంతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.

ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియాగా ఉన్న పల్నాడులో టీడీపీ పాలనలో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చామని గుర్తుచేశారు. కానీ, వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు, కేసులు బనాయించడం, అమాయకులను వేధించడం, శిలాఫలకాలు పగలగొట్టడం పెరిగి పోయాయని అన్నారు. పోలీసుల దగ్గరకు వెళితే న్యాయం జరగకపోవడం వంటి వన్నీ వైసీపీ పాలనలో చూస్తున్నామని ఆరోపించారు. వైసీపీ దాడుల కారణంగా గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆరోపించారు.

Related posts