telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రాణాలు కాపాడండి.. జగన్ కు టిడిపి ఎమ్యెల్యే లేఖ

cm jagan

విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేజీహెచ్ లో 27మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. డెర్మటాలజీ విభాగంలో 20మంది పురుషులు, ఏడుగురు మహిళలు చికిత్స పొందుతున్నారు.
అటు ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు మరికొందరు బాధితులు. ఈ నేపథ్యంలో సిఎం జగన్, సెక్రటరి. ఏకే సింఘాల్, ప్రభుత్వాధికారులకు లేఖ రాశారు తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. విశాఖ జిల్లా బ్లాక్ పంగస్ కేసులపై చర్యలు తీసుకోవాలని…బ్లాక్ పంగస్ కు కెజీహెచ్ లో బెడ్ కేటాయించడమే కాదు… మందులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మందులు లేవని భాధితులు చెప్తున్నారని…ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రులలో కూడా బ్లాక్ ఫంగస్ పై ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలని..ఇప్పటికే అనేక విషయాల్లో లేఖలు రాసిన ముఖ్యమంత్రి జగన్ నుండి ఎలాంటి స్పందన లేదని గుర్తు చేశారు వెలగపూడి.

Related posts