telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైరెక్టర్ తో క‌లిసి తాగి రచ్చ చేశార‌ట క‌దా… అనసూయకు షాకింగ్ ప్రశ్న

Anasuya

స్టార్ యాంక‌ర్ పలు షోలతో పాటు సినిమాల్లో కీలకపాత్రల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అన‌సూయకు తాజాగా ఓ ఆకతాయి నుంచి షాకింగ్ క్వశ్చన్ ఎదురైంది. ‘‘డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో క‌లిసి తాగి రచ్చ చేశార‌ట క‌దా’’ అని ఆ నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో అనసూయ స్పందిస్తూ ‘‘నువ్వు ఇంకా ప‌రిణితి (మెచ్యూర్) చెందిన‌ట్లు లేవు. ప‌రిణితి చెందితే అస‌లు నిజం తెలుస్తుంది బాబూ..’’ అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. దీంతో సదరు నెటిజన్ సైలెంట్ అయిపోయాడు. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు మధ్య దూరం తగ్గిపోతోంది. తమ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు సెలెబ్రిటీలు. కొన్నిసార్లు నెటిజన్ల నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురవడం కూడా సహజమే.

Related posts