ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా “పుష్ప ది రైజ్”. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు.
ఇటీవల ఫస్ట్ పార్ట్ షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘పుష్ప ది రైజ్’ సెన్సార్ను పూర్తి చేసుకుంది. ఏలాగైనా అనుకున్న డేట్ కి ఈ సినిమా తీసుకురావాలని కాంక్ష తో మేకర్స్ లాస్ట్ రెండు నెలలు చాలా కష్టపడ్డారు. అందుకే ప్రమోషన్స్ లేటెస్ట్ గా స్టార్ట్ చేశారు.
ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్, ట్రైలర్కు, స్పెషల్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగులోనే కాదు మిగతా భాషల్లో సైతం పుష్పకు మంచి స్పందన వస్తోంది. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ మరియు హీరోయిన్ రష్మికా మందన్నా లు ప్రమోషన్స్ ని తెలుగు మరియు తమిళ్ లో స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ తెలుగు మరియు తమిళ్ లో ఇంటర్వూస్ కంప్లీట్ చెయ్యగా ..రేపు(డిసెంబర్ 12) రునథంమంలో పుష్ప ప్రి-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఏకంగా 250 కోట్ల రూపాయల బిజినెస్తో జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కులు సహా (ఓటీటీ, డిజిటిల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, హిందీ డబ్బింగ్ రైట్స్) హక్కులు కలిపి రికార్డు ఫిగర్ 250 కోట్లు బిజినెస్ ని జరిపినట్టుగా ఇండస్ట్రీ నుంచి సమాచారం.
Power packed interviews from Team #PushpaTheRise for the Telugu and Tamil audience very soon. #PushpaTheRiseOnDec17 🔥🔥@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/SMVmDBLmN8
— Pushpa (@PushpaMovie) December 11, 2021
బ్రేకప్ పై ఘాటుగా స్పందించిన శృతి హాసన్