ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ తదుపరి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘దర్బార్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ఫస్ట్లుక్ను సైతం విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్లుక్ను చూస్తే అర్థమవుతోంది. బుధవారం నుంచి ‘దర్బార్’ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. ఇటీవల సినిమా ఫొటోషూట్ చిత్రాలు లీకైన విషయం తెలిసిందే. 30 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్కు జోడీగా నయనతార నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ అగ్రనాయికతో చర్చలు జరుగుతున్నాయి.
రజనీకాంత్కు కుమార్తెగా ఓ హీరోయిన్ను నటింపజేయాలని దర్శకుడు అనుకున్నారు. కొందరు యువ హీరోయిన్లతో చర్చలు కూడా జరిగాయి. చివరకు నటి నివేదా థామస్ను ఆ పాత్రకు ఎంచుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమస్యలకు కమర్షియల్ హంగులు జోడించి సినిమాలు తెరకెక్కించడంలో మురుగదాస్ దిట్ట. ఆయన గత చిత్రాలను చూస్తే, ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే, ఇప్పటి వరకూ ఆయన రజనీకాంత్తో ఒక్క సినిమా కూడా తీయలేదు. దీనితో ‘దర్బార్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.