రష్యాలో ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పురుడు పోసే సమయంలో ఆ వైద్యుడు చేసిన పని ఓ పసిబిడ్డకు తల్లి లేకుండా చేసింది. అలీసా టెపికినా అనే ఓ మహిళ నిండు గర్భిణి. పురుటి నొప్పులు రావడంతో ఆమె భర్త నికొలాయ్ ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె క్షణాల్లోనే కన్నుమూసింది. ఆమె ఎందుకు మరణించిందో అర్థంకాని ఆమె భర్త షాకయ్యాడు. పురుడు పోసిన తర్వాత ఆమె గర్భాశయం వెనక్కు తిరిగిందని, అప్పటికి తల్లీబిడ్డలను కలిపి ఉంచే పేగును తొలగించలేదని వైద్యులు తెలిపారు. దాంతో ఆమెకు పురుడు పోసిన వైద్యుడు బలవంతంగా ఆ పేగును బయటకు లాగాడు. ఆ సమయంలో ఆ పేగుతోపాటు ఆమె గర్భాశయం కూడా బయటకు వచ్చేసింది. ఆ కారణంగానే 22 ఏళ్ల అలీసా మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
previous post
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు