‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా సాధించిన విజయం, రాబట్టిన వసూళ్లు ఇండస్ట్రీలో అంతా ఆయన వైపు చూసేలా చేశాయి. ఇప్పటివరకు తన రెండో సినిమాను పట్టాలెక్కించలేదు. అయితే ఆయన తదుపరి సినిమాగా ‘మహా సముద్రం’ రూపొందనుందనీ, ఇది యాక్షన్ తో కూడిన ప్రేమకథాంశమనే టాక్ వచ్చింది. కథను రెడీ చేసి మాస్ మహారాజ్ రవితేజకు చెప్పాడు. కథ నచ్చడంతో రవితేజ కూడా ఓకే చెప్పాడు. కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా ఫిక్స్ కూడా చేసినట్టు సమాచారం. ఈ దశలో రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో రవితేజ ఈ సినిమాను పక్కనబెట్టి వేరొక సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అజయ్ భూపతి ఈ కథను అక్కినేని నాగచైతన్యకు వినిపించబోతున్నట్టు సమాచారం. నాగచైతన్య ఇమేజ్కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసే పనిలో అజయ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడట. త్వరలోనే నాగచైతన్యకు కథ వినిపించనున్నాడట.
next post
అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్