బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే భర్త, దర్శకుడు, నిర్మాత మరియు ఎడిటర్ అయిన సామ్ అహ్మద్ బాంబే అరెస్ట్ అయ్యారు. పూనమ్ పై అతను భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపించడంతో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం, పూనమ్ తల, కన్ను , ముఖానికి గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేరింది.
పూనమ్ పాండే భర్త, సామ్ బాంబే తనపై దాడికి పాల్పడ్డారని నటి ఫిర్యాదు చేయడంతో నిన్న ముంబైలో అరెస్టు చేశారు. పూనమ్ పాండేని ఆసుపత్రిలో చేర్పించారు’ అని ముంబై పోలీసులు తెలిపారు.
సామ్ బాంబేపై పూనమ్ పాండే ఫిర్యాదు చేయడం ఇదేమి మొదటిసారి కాదు. 2020లో తనపై దాడి, వేధింపులుతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడని సామ్పై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతనితో వీడాకులు తీసుకున్నట్లు నిర్ణయించుకున్నానని తెలిపింది. సామ్ను అప్పట్లో గోవా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సామ్ బెయిల్పై విడుదలయ్యాడు.
ఈ సందర్భంగా పూనమ్ మాట్లాడుతూ.. “జంతువులా” తనను “కొట్టిన” వ్యక్తితో కొనసాగడం మంచిది కాదని ,సామ్ బాంబేపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆమెను బలవంతం చేసిన సంఘటన గురించి శరీరకంగా నన్ను ఉక్కిరిబిక్కిరి చేయడంతో నేను చనిపోతానమో అనుకున్నాను. అతను నా ముఖం మీద కొట్టి.. నా జుట్టుతో నన్ను లాగి, మంచం మూలకు నా తలని కొట్టాడు. అతను నా శరీరంపై మోకరిల్లి కూర్చుని, నన్ను పిన్ చేసి, నాపై దాడి చేశాడు. ఎలాగోలా నేను గది నుండి బయటకు రాగలిగాను అని చెప్పుకొచ్చింది.
కాగా..గతేడాది సెప్టెంబర్ 10న ముంబైలో జరిగిన ప్రైవేట్ వేడుకలో పూనమ్ పాండే మరియు సామ్ బాంబే వివాహం చేసుకున్నారు. ఇద్దరూ తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను Instagramలో పంచుకున్నారు. వారి పెళ్లికి ముందు, పూనమ్ మరియు సామ్ మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు.
గాంధీజీపై కంగనా షాకింగ్ కామెంట్స్