రామ్ “ఇస్మార్ట్ శంకర్”తో బాక్సాఫీస్ని షేక్ చేసి ప్రేక్షకులకి మంచి ట్రీట్ అందించాడు. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంకి మంచి ఆదరణ లభించింది. ఇన్నాళ్ళు చాలా సాఫ్ట్గా కనిపించిన రామ్ తొలి సారి మాస్ లుక్లో తెలంగాణ యాసతో అదరగొట్టాడు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. మార్ ముంత చోడ్ చింత అంటూ రామ్ చెప్పిన డైలాగ్స్ మాస్కి మాంచి కిక్ ఇచ్చాయి. తొలి రోజు నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రం పలు చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పూరీ జగన్నాథ్ స్టైలిష్ టేకింగ్, నభా నటేష్, నిధి అగర్వాల్ల గ్లామర్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఈ చిత్రంతో రామ్ తన కెరియర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించారు. జూలై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రం సక్సెస్ ఫుల్గా 50 రోజులు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలో పడ్డాడు రామ్. అందుకే ఇప్పటి వరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. అయితే మాస్ డైరెక్టర్ వివి వినాయక్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. “ఇస్మార్ట్ శంకర్” హిట్తో జోరు మీదున్న రామ్.. మాస్ సినిమాలే చేసే దిశగా అడుగులు వేస్తున్నారట. ప్రేమ కథల్లో కూడా మాస్, యాక్షన్ ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారట. ఈ కాంసెప్ట్తోనే వివి వినాయక్ సినిమాకు ఓకే చెప్పారట. ఓన్లీ ప్రేమ కథతో వచ్చిన మరో దర్శకుడుకి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ గతంలో రామ్కు మంచి హిట్ ఇచ్చిన సరే… మాస్ కథతోనే తన వద్దకు రావాలని చెప్పారట. ఇప్పుడు వివి వినాయక్ మాస్ కథతో రావడంతో రామ్ వెంటనే ఒప్పుకున్నారట. ‘ఇంటెలిజెన్స్’ సినిమాతో డిజాస్టర్ మూట గట్టుకున్న వినాయక్.. రామ్ సినిమాతోనైనా హిట్ కొట్టాలనే పట్టులో ఉన్నారట. మరి రామ్-వినాయక్ ప్రాజెక్టు ఎప్పుడు పెట్టాలెక్కుతుందో చూడాలి. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
previous post
next post
శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు : మాధురీ దీక్షిత్