telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయ‌లేదు : మాధురీ దీక్షిత్

Madhur-dixit

ఒక‌ప్పుడు హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లో సత్తా చాటిన హీరోయిన్లు మాధురి దీక్షిత్, శ్రీదేవి. 53 ఏళ్ళ వ‌య‌స్సున్న మాధురీ దీక్షిత్ ‘కళంక్‌’ సినిమాతో 2019లో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్‌ తీస్తున్న నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాధురీ దీక్షిత్‌.. శ్రీదేవితో పోటీపై స్పందించింది. వృత్తి ప‌ట్ల ఎంతో అంకిత భావంతో ప‌ని చేసిన శ్రీదేవి.. త‌న జీవితాన్ని న‌టన‌కే అంకితం చేశారు. శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయ‌లేదు. మా మ‌ధ్య పోటీ ఉండేద‌ని వ‌చ్చిన వార్త‌ల‌లో వాస్త‌వం లేదు. మేం రేసు గుర్రాలం కాదు, కాబట్టి ఎవరు ముందు ఉన్నారనే విషయం గురించి ఆలోచించకండి’ అని పేర్కొన్నారు మాధురీ. లాక్‌డౌన్ వ‌ల‌న కుటుంబంతో క‌లిసి గ‌డిపే స‌మ‌యం దొరికింది. ఖాళీ స‌మ‌యంలో క‌థ‌క్ సాధ‌న చేస్తూ, వంట‌లు ట్రై చేస్తున్నాను అంటూ ప‌లు విష‌యాలు పంచుకుంది. మాధురీ.

Related posts