telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రిపరేషన్ కు సమయం ఇచ్చి..పది పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్

suresh adimulapu minister

కరోనా వ్యాప్తిని అరైకట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించడంతో ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత విద్యార్థులకు ముందుగా ప్రిపరేషన్ కు సమయం ఇచ్చి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం దూరదర్శన్ సప్తగిరి చానల్ లో 10వ తరగతి విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్ లైన్ బోధన ఉంటుందని వివరించారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Related posts