సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటేసేందుకు వెళ్లిన చోటే ఈవీఎం మొరాయించడం విశేషం. గురువారం ఉదయం ద్వివేది అమరావతిలోని తాడేపల్లి క్రిస్టియన్పేట మున్సిపల్ హైస్కూల్లో ఓటు వేసేందుకు వెళ్లారు. ఆయన ఓటేసిన సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన వీవీప్యాట్ పనిచేయ లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా యాభై పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు లేదా వీవీ ప్యాట్లు మొరాయించినట్లు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు. సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వాటికి మరమ్మతులు జరిపి అందుబాటులోకి తెస్తారని వివరించారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు.