telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జాగర్తగా ఓటు వేయండి.. : ఈవీఎం సమస్యలతో .. ఒక పార్టీకి ఓటు వేస్తె, మరో పార్టీకి పడుతుందట… !

OU students wrote letter to EC

ఓ పోలింగ్ బూత్ లోని ఈవీఎం విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఓటర్లకు షాకిచ్చింది. వారు ఒక గుర్తుకు ఓటేస్తే మరొక దానికి పడుతుండడంతో ఆశ్చర్యపోవడం వారి వంతయింది. మండలంలోని 260వ నంబరు పోలింగ్‌ బూత్‌లో ఉదయం ఏడు గంటలకు ఎప్పటిలాగే పోలింగ్‌ ప్రారంభమైంది. కొందరు ఓటర్లు సీపీఎం అభ్యర్థికి ఓటేశారు. ఆ ఓటు బీజేపీ అభ్యర్థికి పడుతుండడాన్ని గుర్తించి వెంటనే ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

ప్రిసైడింగ్‌ అధికారి దాన్ని పరిశీలించి సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే పోలింగ్‌ నిలిపివేశారు. సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు. ఏజెన్సీ పోలింగ్‌ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి కనిపించడంతో ఈసారి పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts