telugu navyamedia
రాజకీయ

సోనియా, రాహుల్ లకు ఈడీ నోటీసులు..

నేషనల్‌ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్‌ గాంధీని, జూన్‌ 8వ తేదీ లోపు సోనియా గాంధీని విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు పంపింది.

మరోవైపు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జెవాలా స్పందించారు.. 1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారు. ఆ సమయంలో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఇందుకోసం మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పనిచేస్తోందన్నారు. తమ నేతలకు నోటీసులు ఇవ్వదాన్ని సరికొత్త పిరికిపంద చర్య అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ చెప్పిన తేదీకి హాజరవుతారని, అయితే రాహుల్ గాంధీకి మాత్రం కొంత వ్యవధి కావాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ.. దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తుందని ధృవీకరించారు. అయితే మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు

Related posts