telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

Etala Rajender

జాతీయ సగటు కంటే తెలంగాణలో టెస్టులు తక్కువగానే ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. ఈ లేఖపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఈటల అన్నారు.

ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టు పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పటిష్ట చర్యల వల్ల కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

Related posts