రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రాశీ ఖన్నా ఇటీవల విడుదలైన జై లవకుశ, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోను తన హవా చూపిస్తున్న రాశీ ఖన్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్కి జోడీగా అయోగ్య అనే చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ‘సైతాన్ కా బచ్చా’, “సంగ తమీజన్” , కడాసి విడాసై అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ఇటీవల మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా తో హిట్ అందుకుంది. ఆతర్వాత ‘వెంకీమామ’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొట్టింది. ఇక ఈభామ మొదటినుంచి గ్లామర్ షోతో ఆకట్టుకుంటూనే ఉంది. అయితే రాశి తమిళ్ లో సూర్య సరసన “అరువా” సినిమాలో నటిస్తుంది. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. ఇక ఈ సినిమాలో రాశిఖన్నా బికినీలో కనిపించనుందని తెలుస్తుంది. గతంలో రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో రాశి బికినీలో కనిపించింది.
previous post
next post
అమలాపాల్ మాజీ భర్తతో విడిపోవడానికి కారణం అది కాదట…!