telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మొహర్రం ఊరేగింపుపై హైకోర్టులో పిటిషన్

Muharam

ముస్లింలు మొహర్రం పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిచడం ఆనవాయతీ. అయితే, కరోనా కారణంగా ఎవరూ ఏ కార్యక్రమం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఊరేగింపు పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని స్పష్టం చేసింది. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి నిన్ననే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ను నిరాకరించిందని తెలిపింది. అందువల్ల హైకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని తెలిపింది.

Related posts