telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో బాలీవుడ్ హీరోయిన్ కు కరోనా

Natasha

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ నటాషా సూరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట. ఆ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. “ముఖ్యమైన పని ఉండి ఇటీవలే పూణె వెళ్లి వచ్చాను. వచ్చిన రెండు మూడు రోజులకు జ్వరం వచ్చింది. అనుమానం వచ్చి పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.” ప్రస్తుతం స్వల్ప జ్వరం మరియు నీరసం ఉన్నట్లుగా ఆమె పేర్కొంది. ఈ భామ బిపాస బసు మరియు కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలో నటించిన ‘డేంజరస్’ చిత్రంలో నటించింది. ఆగస్టు 14వ తారీకున ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది.

Related posts