బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. 150 కోట్ల రూపాయల బడ్జెట్తో సుజీత్ ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఈ చిత్ర టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో కళ్ళు చెదిరే సన్నివేశాలతో పాటు ప్రభాస్ చేసే స్టంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి.
సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఆమె లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ చిత్రానికి పని చేస్తుండగా , ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది. సాహో చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుండగా,ఈ చిత్రానికి శంకర్-ఎషెహన్-లాయ్లు సంగీతం సమకూరుస్తున్నారు.