టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భీమవరంలో రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది.. పవన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వరాదన్నది వారి లక్ష్యం.. అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా వర్మ రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే. పవన్ కల్యాణ్ను నిజంగా గెలిపించాలనుకుంటే ఓటర్లు అతనికే ఓటు వేసేవారు. పవన్ వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి ” అని ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
ఆర్జీవీ ట్వీట్పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడెప్పుడో వివాదమవ్వడంతో చాలా రోజులుగా మెగా ఫ్యామిలీ గురించి ట్వీట్ చేయని ఆర్జీవీ.. ఇలా మళ్లీ మొదలెట్టేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ అసలేమన్నారు..!? జనసేన పార్టీని ఒక్క ఓటమి ఆపలేదని.. పరాజయాన్ని అంగీకరించని తాను గెలిచేవరకూ పోరాటం చేస్తూనే ఉంటానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘నా జీవితం రాజకీయాలకే అంకితం.. మళ్లీ చెబుతున్నా.. నన్ను నలుగురు మోసుకెళ్లేవరకూ జనసేనను మోస్తా.. నాకు ఓటమి కొత్తకాదు.. దెబ్బ తగిలే కొద్దీ ఎదిగే వ్యక్తిని.. 25 ఏళ్లు లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా.. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తా.. నన్ను ఓడించేందుకు భీమవరంలో రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది.. పవన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వరాదన్నది వారి లక్ష్యం. ప్రజా తీర్పును గౌరవిద్దామని.. వైసీపీ పాలన ఎలా ఉంటుందో చూద్దాం.. అని పవన్ వ్యాఖ్యానించారు.
కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా… వర్మకు ప్రముఖ నిర్మాత కౌంటర్