ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును పదవి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏసీబీ డీజీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఉత్తర్వుల మేరకు జీవో నెంబర్ 882ను ఈ సందర్భంగా సీఎస్ విడుదల చేశారు. ఎన్నికలు పూర్తవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీని హెడ్ క్వార్టర్స్కు ఎన్నికల కమిషన్ అటాచ్ చేసింది.
ఈసీని కలిస్తే మోదీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు: చంద్రబాబు