ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలోని ముపు ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. పంట పొలాలు నీట మునిగిన దృశ్యాలను వీక్షించారు.
సీఎం వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులు కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. కాగా, వరద బాధితులకు సీఎం జగన్ రూ.2 వేల చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు.
రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్