ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ రహస్యంగా భేటీ అయ్యారు. వీరి భేటీపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు ముగ్గురు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబే సూత్రధారి అని అంబటి ఆరోపించారు. బీజేపీలో ఉన్నప్పటికీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ టీడీపీ కోసం పని చేస్తున్నారని అన్నారు.
వ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని అంబటి విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో ఆయన ఎక్స్ పర్ట్ అని అన్నారు. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందని చెప్పారు. నిమ్మగడ్డ బండారాన్ని బయట పెట్టేందుకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. హోటల్ లో జరిగిన భేటీలో ఈ ముగ్గురూ కలిసి ఎవరితో మాట్లాడారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.