telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా నివారణపై ఏపీ సర్కారు దృష్టి.. ప్రతి జిల్లాకి రూ.కోటి కేటాయింపు

corona vaccine India

కరోనా నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. వైరస్ బాధితులకు చికిత్సకోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయల చొప్పున కేటాయించిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలకు వాడతారని వివరించింది. వాటి కేంద్రాలను జేసీలు పర్యవేక్షిస్తారని కొవిడ్-19 నియంత్రణ నోడల్ అధికారి కృష్ణ బాబు తెలిపారు.

క్వారంటైన్‌ కేంద్రాల్లో పడకల సంఖ్య 5,000కు పెంచాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కరోనా బాధితులకు ఆహారం కోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున కేటాయిస్తున్నట్లు  తెలిపారు.

Related posts