ఏపీ సీఎం జగన్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం హోదాలో జగన్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్ భవన్ కు ఆయన పయనం అయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరగనుంది. ఏపీ సీఎం జగన్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇఫ్తార్ విందులో పాల్గొనాలంటూ ఆహ్వానాలు వెళ్లాయి. ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకే జగన్ హైదరాబాద్ బయలుదేరారు.
previous post
స్వచ్ఛమైన రాజకీయాలు చేశాం: పవన్ కల్యాణ్