కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నాట్కో ఫార్మా లిమిటెడ్ మద్దతుగా లిచింది. ఆ సంస్థ తమ వంతు సాయంగా వైద్య పరికరాలను అందజేసింది. రూ.2.50 కోట్ల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్స్ అందించింది.
రూ.1.50 కోట్ల విలువైన మందులు, పరికరాలను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా నాట్కోకు మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్-19పై పోరాటానికి ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు.