వ్యాపార ప్రయోజనాల కోసమే సినీ నటుడు మోహన్బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజురీయింబర్స్మెంట్పై నిరసన తెలుపుతున్న మోహన్బాబు పై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి ఆయన వంతపాడుతున్నారని కుటుంబరావు ఆరోపించారు.
మోహన్బాబు విద్యాదానం చేస్తున్నారా? లేక బిజినెస్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం అయిన వైసీపీకి మోహన్బాబు వంతపాడుతున్నారని, కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్మెంట్ ఇచ్చామని చెప్పారు. ఎన్నికల సమయంలో మోహన్బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన ఏ రోజైనా మాట్లాడారా? అని ప్రశ్నించారని మండిపడ్డారు.