telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లంచాలను రూపుమాపడమే లక్ష్యంగా చర్యలు: సీఎం జగన్

లంచాలను రూపుమాపడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజలు ఫిర్యాదు చేసేందుకు సిటిజన్ హెల్స్ లైన్ కాల్ సెంటర్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 14400 నంబరుకు డయల్ చేసి ప్రజలు తమ ఫిర్యాదులు చేయాల్సిందిగా కోరారు.

పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు లంచాలను రూపుమాపడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేoదుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Related posts