telugu navyamedia
రాజకీయ వార్తలు

బీర్‌ సీసాల పై గాంధీ చిత్రాలు.. క్షమాపణ చెప్పిన లిక్కర్ కంపెనీలు

ghandi photo beer bottle

బీర్‌ సీసాల పై మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించిన ఘటన ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది. . మంగళవారం జీరోఅవర్‌ సందర్భంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ఆప్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌ లేవనెత్తారు. దీనిపై విదేశాంగమంత్రి జైశంకర్‌ వివరణ ఇస్తూ ఆ సంస్థ ప్రజలకు, భారత ప్రభుత్వానికి హృదయపూర్వక క్షమాపణలు తెలిపిందని తెలిపారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌ కంపెనీ క్షమాపణలు కోరిందని, ఆ చిత్రంతో మద్యం ఉత్పత్తిని నిలిపివేసిందని, సరఫరా చేసిన సీసాలను వెనక్కి తీసుకుందని జయశంకర్‌ తెలిపారు.

ఇజ్రాయెల్‌ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ బీర్‌ తయారీ కంపెనీలు మాల్కా బ్రేవరీ, నెగేవ్‌ బీర్స్‌ ఈ చర్యకు పాల్పడ్డాయి. తమ బీర్లకు పబ్లిసిటీ కల్పించేందుకు ఏకంగా వివిధ దేశాల ప్రముఖ వ్యక్తుల ముఖచిత్రాలను బీర్‌ బాటిళ్లపై ముద్రించాయి. ఇందులో భాగంగా టీ షర్ట్‌ వేసుకొని.. కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకున్న మహాత్మాగాంధీ చిత్రాన్ని బీర్‌ బాటిల్‌పై ముద్రించాయి. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఏకంగా బీర్‌ బాటిళ్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించి.. అవమానించడంపై భారతీయులు మండిపడుతున్నారు. ఈవిధంగా స్వాతంత్ర్యయోధులను కించపరిచిన ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహులకు లేఖలు రాశారు.

Related posts