చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో ఆనందిగా ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రత్యూష బెనర్జీ మరణించి నాలుగు ఏళ్లు అవుతుంది. ప్రత్యూష 2016 ఏప్రిల్1న ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె శ్రద్ధాంజలి సందర్భంగా ఆమె చిత్రాపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలనుకున్న తండ్రికి లాక్డౌన్ కారణంగా నిరాశే ఎదురైంది. రోజంతా తిరిగినా తనకు పూలదండ దొరకలేదని ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం తన కూతురి శ్రద్ధాంజలికి పూలమాల వేసి నివాళులు అర్పించేవాడినని, ఈసారి లాక్డౌన్ సందర్భంగా పరిస్థితులు మారాయని స్థానిక మీడియాతో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారాయన. చివరికి తనే కొన్ని పువ్వులను తీసుకొని పూలదండ సిద్ధం చేసి ప్రత్యూషకు నివాళులు అర్పించినట్లు చెప్పుకొచ్చారు.