కరోనా భయంతో ఎవరికి వాళ్లే ఇంట్లోనే ఉంటూ భయటకు రాకుండా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ పార్క్లో ఫొటో షూట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పాయల్ పార్క్లో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు జనం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీ చుట్టూ ఉండే జనాన్ని ఈ దేశాన్ని కాపాడండి అంటూ చెప్తూనే ఉన్నా ఏ మాత్రం బాధ్యత లేకుండా లాక్ డౌన్ టైంలో పార్కుల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులు కొడతావా అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఫొటో షూట్ ఇప్పుడిది కాదని. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే తనకు ఇష్టం అని ఆ రోజుల్ని మిస్ అయ్యా అంటూ మరో పోస్ట్ పెట్టింది పాయల్.