telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తనపై ట్రోల్స్ చేసేవారికి సమాధానం చెప్పిన సోనూసూద్

Sonu-Sood

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. సోనూసూద్ ఇటివల పేద విద్యార్దుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన విద్యార్దులకి స్కాలర్ షిప్ లు ఇస్తామని సోనుసూద్ ప్రకటించాడు. వార్షికాదాయం రూ. 2 లక్షలు లోపు ఉన్న కుటుంబాలకి చెందిన, మెరుగైన ఉత్తిర్ణత సాధించిన విద్యార్దులు [email protected] మెయిల్ కి పది రోజుల లోగు వివరాలు పంపాలని సోనూసూద్ వెల్లడించాడు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. అయితే ఆయన చేస్తున్న సామాజిక సేవను తప్పు బడుతూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దీనిపైన తాజాగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ సూద్‌ స్పందించాడు. “నేను సాయం చేసిన వారి డేటా అంతా నా దగ్గర ఉంది. వారికి సంబంధించిన చిరునామాలు, ఫోన్‌ నంబర్లు నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా విదేశాల నుంచి తీసుకువచ్చిన విద్యార్థుల వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి.. కానీ నేను స్పష్టం చేయాలనుకోవట్లేదు.. నన్ను విమర్శించేందుకు బదులుగా బయటకు వెళ్లి ఎవరికైనా సాయం చేయాలని కోరుతున్నాను” అని సోనూసూద్ వెల్లడించాడు. ఇక ఎవరు ఎన్ని విమర్శలు చేసిన అవి నన్ను ప్రభావితం చేయవు. నేను చేయాలనుకున్నది చేస్తాను అంటూ వెల్లడించాడు సోనూసూద్. ఇక తనకు పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశాడు సోనూసూద్.

 

Related posts