telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గాంధీ స్కెచ్ ను గీసిన హాస్యబ్రహ్మ

BRahmanandam

లాక్ డౌన్ పుణ్యమా అని హాస్యబ్రహ్మ బ్రహ్మానందంలోని సరికొత్త టాలెంట్ గురించి తెలుసుకునే అవకాశం అందరికి కలిగింది. ఖాళీ సమయంలో చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యాన్ని బయటపెడుతున్నారు. వరుసగా స్కెచ్ లు గీసి ప్రేక్షకులను అబ్బుర పరుస్తున్నారు. తాజాగా నిన్న గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత బాపు స్కెచ్‌ను అద్భుతంగా గీసారు బ్రహ్మానందం.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడు స్కెచ్ ని, శ్రీశ్రీ స్కెచ్ ని గీసి వావ్ అనిపించారు. ఇక బ్రహ్మానందం ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది చాలా ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది, మరాఠీ భాషలో మంచి హిట్ అయిన నటసామ్రాట్‌ సినిమాకి ఇది రీమేక్.. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Related posts