వైపీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. మహిళలపై దాడి చేసి, అరెస్టు చేయడం అన్యాయం. ఒంగోలులో మహిళలపై మగ పోలీసులు దాడి చేయడం కలచి వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా?, ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నామా? అని ప్రశ్నించారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. కుల, మతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేసి ఈ దారుణాలు ఆపాలి. కులాల మధ్య చిచ్చు పెట్టి అలజడి సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వాటిని అరికట్టలేకపోతే నా పదవులు నాకు అనవసరం. పార్టీ సహకారం లేకున్నా.. వ్యక్తిగతంగా అయినా పోరాడతానని అన్నారు.
అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారు. ఏ నిబంధనలు ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారు. అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకోకుండా అడ్డుకున్నారు. కులం వివరాల కోసం ఇబ్బందులు పెడతారా?, వైసీపీ ర్యాలీలకు ఎలా అనుమతి ఇస్తున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర: చంద్రబాబు