telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ: శివరాజ్‌సింగ్

Shivraj ingh

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కోలుకోలేని దెబ్బ తిన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా విజయవాడ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీని తిట్టడమే తప్ప, తాను చేసిన అభివృద్ధి ఏమిటో బాబు చెప్పలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా వద్దన్నారని ప్యాకేజీకే అంగీకరించారని అన్నారు.

ఏపీలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని, టీడీపీ కూడా ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందని శివరాజ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, బీజేపీ మాత్రం వాటిని ఎంతమాత్రమూ ప్రోత్సహించదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అనేక రాష్ట్రాల్లో జీరో స్థాయిలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఏపీలో కూడా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Related posts