ఏపీ సీఎం వై.ఎస్.జగన్ పదేపదే తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారంటూ వ్యాఖ్యానించడం సరికాదని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఈరోజు గుంటూరులో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాల్లో తానో బాధితుడినని స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా పోలీసులు తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తమను పలు రూపాల్లో మోసం చేశారంటూ ఇటీవల కాలంలో కోడెల శివప్రసాద్, ఆయన కొడుకు, కూతురుపై వరుస కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో వై.ఎస్.జగన్ ప్రభుత్వం తీరు సరిగా లేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదని, ఇలా వ్యవహరిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రారని దుయ్యబట్టారు.
చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడు: విజయసాయి