telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు భద్రత కుదింపు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

chandrababu

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రత కుదింపు పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2004-14 మధ్యకాలంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఓ ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి సీఎస్ఓలు సెక్యూరిటీగా ఉండేవారు.

వీరి కింద ముగ్గురు ఆర్ఐలు, ఆర్ఐల పరిధిలో ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు ఉండేవారు.ప్రస్తుతం ఓ డీఎస్పీతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం కేటాయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.

Related posts