అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ విషయాలను ట్రంప్ తో చర్చించారు. ఇరువురు దాదాపు 30 నిమిషాల పాటు ఫోన్ ద్వారా సంభాషించారు. ఇటీవలే ఆర్టికల్ 370 రద్దు చేయడం దరిమిలా ఏర్పడిన పరిణామాలను మోదీ అమెరికా అధ్యక్షుడికి వివరించారు.
పాక్ తో సంబంధాలు, జమ్మూకశ్మీర్ ప్రస్తుత పరిస్థితులు, సరిహద్దు ఉగ్రవాదం గురించి కూడా చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించే స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని మోదీ అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా, అమెరికా వాణిజ్య ప్రతినిధులు మరోసారి సమావేశం కావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.
అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు