telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారుల సహకారంతోనే అనేక రంగాల్లో తాము నంబర్ 1గా నిలిచామన్నారు. అలాంటిది ఇప్పుడు ఈసీ రూపంలోఅధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. నేతెలంగాణ సీఎం సమీక్షలు నిర్వహిస్తే ఎవరూ నోరు మెదపరని, ఇక్కడ తాము ఏదైనా సమీక్ష పెడుతుంటే నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, వాటికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Related posts