మూడు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి నుంచి శిశువు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఆ శిశువు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సీసీటీవీ ఫుటేజీ ఉన్నా కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. గురువారం పాప తల్లిదండ్రులను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు.భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. జిల్లా ఆసుపత్రిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరనున్నట్టు తెలిపారు. పాపను అప్పగించిన వారికి తమ వేతనం నుంచి రూ.2 లక్షలు బహుమానం ఇస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
previous post