ఉదయం 11.00 గంటల నుంచి రాజ్ ఘాట్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష ఈ నిరసన కార్యక్రమం ప్రారంభించారు.
రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా భీం దీక్షలు చేపట్టారు తెలంగాణ బీజేపీ.
బండి సంజయ్తో పాటు ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఎంపీ అరవింద్ ధర్మపురి, బిజెపి నేతలు కామర్సు బాలసుబ్రహ్మణ్యం, వెదిరె శ్రీరామ్, నూనె బాలరాజ్ తదితరులు తెలంగాణ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశంపై పోరాడాలని వ్యూహం రచిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భారత రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ రోజు ఢిల్లీలో మౌన దీక్ష చేపట్టారు. బీజేపీ భీమ్ దీక్ష పేరుతో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు, సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది.