టీవీ9 సీఈఓ రవిప్రకాష్ సంస్థకు హాని కల్గించే ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులతో కుమ్మకై ఫోర్జరీ పత్రాలను సృష్టించారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంస్థ ప్రయోజనాలకు సంబంధించి రవిప్రకాష్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడ పెట్టింది.
రవి ప్రకాష్పై సైబరాబాద్ సీసీఎస్ పోలీస్స్టేషన్లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు.ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం నాడు రవిప్రకాష్ ఇంట్లోనూ, కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.ఈ సోదాలు జరిగిన సమయంలో రవిప్రకాష్ మాత్రం ఇంట్లో లేడు. రవిప్రకాష్ పాస్పోర్ట్ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.