అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ అనౌన్స్ చేసిన 400 సౌత్ ఏసియన్స్లో పలువురు ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు కూడా స్థానం సంపాదించుకుని అరుదైన గౌరవం అందుకున్నారు. ఆర్ట్స్, మీడియా, కల్చర్లలోని ప్రముఖులు ఈ లిస్ట్లో చోటు సాధించారు. ఈ విషయాన్ని ఓ వీడియోలో వెల్లడించారు అడివి శేష్. “2020కి గానూ 400 మోస్ట్ ఇన్ల్ఫూయెన్సియల్ లిస్ట్లో నేను కూడా ఉన్నారు. నన్ను, నా పనిని గుర్తించిన న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీకి థ్యాంక్స్. ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, రెహత్ ఫతే అలీ ఖాన్, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి వారితో పాటు ప్రముఖ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు” అని తెలిపారు.
Most happening actor @AdiviSesh thanking all the people out there and especially Kiran Roy of new press agency for selecting him among one of the 400 most influential people from South!! #MajorTheFilm #AdiviSesh pic.twitter.com/D1qm5ls9An
— BARaju (@baraju_SuperHit) November 2, 2020
కాగా కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో అడివి శేషు తాజా చిత్రం “మేజర్”. 2008లో ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్ 26/11లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కమాండర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మేజర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో శేషు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ‘దబాంగ్-3’ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి అడవి శేషుతో ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మహేష్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.