telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో మెగా హీరోతో క్రిష్ స్పై థ్రిల్లర్

Krish

ఎన్టీఆర్ బయోపిక్ తీవ్ర నిరాశను మిగల్చడంతో కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న క్రిష్ త్వ‌ర‌లో పవ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఓ చారిత్రాత్మ‌క చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. పాన్ ఇండియాగా మూవీగా క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత క్రిష్ మ‌రో మెగా ఫ్యామిలీ హీరోతో క‌లిసి స్పై థ్రిల్ల‌ర్ చేయ‌నున్నాడ‌ట‌. గ‌తంలో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్క‌ష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టికి, క్రిష్.. గౌత‌మిపుత్ర శాత‌కర్ణి చిత్రంతో బిజీగా ఉండ‌డం వ‌ల‌న కుద‌ర‌లేద‌నే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ఏడాదే స్పై థ్రిల్ల‌ర్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు క్రిష్‌. గ‌తంలో క్రిష్‌, వరుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన “కంచె” చిత్రం నేష‌న‌ల్ అవార్డ్ పొందిన విష‌యం తెలిసిందే. కాగా వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత క్రిష్‌తో క‌లిసి స్పై థ్రిల్ల‌ర్ చేయ‌నున్నాడు.

Related posts