త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్లు ఇటీవల ఫిలింనగర్లో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ కాంబోలో సినిమా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఈ మూవీని స్రవంతి రవి కిశోర్ నిర్మించనున్నట్లు టాక్. ఇక ఇందులో హీరోయిన్గా అనుపమ పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ మూవీ ద్వారా అనుపమ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రామ్ కోసం అనుపమను తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మూడోసారి ఆ జోడీని తెరపై చూడొచ్చు. ఈ క్రేజీ జంట ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో కలిసి నటించారు. ఇందులో ఉన్నది ఒక్కటే జిందగీ యావరేజ్గా నిలిచినప్పటికీ, హలో గురు ప్రేమ కోసమే విజయవంతమైంది. ఇక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.