మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రామ్ చరణ్, నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్లో ప్రకటించింది. అయితే.. తాజాగా మరో వార్త ఈ సినిమా నుంచి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పుట్ట బొమ్మ పూజా హెగ్డే సందడి చేయనుందని టాక్. ఓ ప్రత్యేక పాత్రలో ఆమె ఈ సినిమాలో అలరించనుందట. అది కూడా చెర్రీ కి లవర్గా మెరవనుందని సమాచారం. ఈ మేరకు ఈ ముద్దుగుమ్మ ను సంప్రదించారట. దీంతో ఈ ప్రాజెక్ట్పై ఇంకా భారీ అంచనాలు పెరుగుతున్నాయి. కాగా… పూజా హెగ్డే “అల వైకుంఠపురం లో” మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు… టాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మ టాప్లోనూ నిలిచింది.
previous post
“సాహో”పై గుర్రుగా ఉన్న చందమామ