బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తున్నారు.
దేశ రాజకీయ చరిత్రలో ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం, ఆ సమయంలో జరిగిన ఘటనలపై ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
కంగనా ఇందిరా గాంధీ లుక్ లో అదిరిపోయారు. అచ్చుగుద్దినట్టు ఆమెలాగా కనిపించడంతో పాటు హావభావాలు పలికించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “అమెరికా ప్రెసిడెంట్ కి చెప్పండి. నా కార్యాలయంలో అందరూ నన్ను మేడమ్ కాదు సర్ అని పిలుస్తారని చెప్పండి” అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
కాగా..ఈ టీజర్కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ఇందిరా గాంధీ తిరిగొచ్చింది. పర్ఫెక్ట్ లుక్’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో చాలా కీలకమైన సమయం. అధికారంపై మనం చూసే కోణాన్ని మార్చేసింది. అందుకే ఈ కథను చెప్పాలనుకుంటున్నాను” అని కంగనా టీజర్ రిలీజ్ సందర్భంగా పేర్కొన్నారు.
1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. అందుకే భారతదేశంలో ఎమర్జెన్సీ ని చీకటి రోజులుగా భావిస్తారు.
‘పింక్’ ఫేమ్ రితీశ్ షా ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, డైలాగులు అందించగా.. కంగనా, రేణు పిట్టీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. మణికర్ణిక తర్వాత కంగనా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే.
కమల్, రజనీ రాజకీయాలపై తమన్నా స్పందన