ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 370 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి భారీ వసూళ్ళు సాధించడం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద జెట్ స్పీడ్లో పరుగులు తీస్తోంది. విడుదలై 7 రోజులు అవుతున్నా కలెక్షన్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తొలి రోజు నుంచి వసూళ్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే “సాహో”లో జాక్వెలిన్ చేసిన పాటకు ముందుగా కాజల్నే అనుకున్నారట. కాజల్ కూడా ఆనందంగానే ఓకే చెప్పిందట కూడా. కాకపోతే రెమ్యునరేషన్ కింద రెండు కోట్లు ఇవ్వమందట. సినిమాకి వందల కోట్లు ఖర్చు పెడుతుంటే తనకు ఆ మాత్రం ఇవ్వరా అని కూడా అనుకుందట. కానీ నిర్మాతలు మాత్రం అంత ఇవ్వలేమంటూ తప్పుకున్నారట. ఆ తరువాత జాక్వెలిన్కి అంత ఇచ్చి పెట్టుకోవడంపైనే కాజల్ గుర్రుగా ఉందట. తనకేం తక్కువనీ, తనను కాదని జాక్వెలిన్ పెట్టుకున్నారన్నది కాజల్ బాధ. కాజల్ బాధలో అర్ధమున్నా, ఎవరి లెక్కలు వారికుంటాయి కదా… అంటున్నారు సినీ జనాలు.
నా సోదరుడికి జగన్ అంటే ప్రాణం: పూరీ జగన్నాథ్