telugu navyamedia
సినిమా వార్తలు

“శ్రీమంతుడు”కు నాలుగేళ్ళు పూర్తి

Srimanthudu

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “శ్రీమంతుడు”. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటించింది. ఆగస్ట్ 7, 2015న విడుదలైన ఈ చిత్రం 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా వచ్చి అప్పుడే నాలుగేళ్లు పూర్తైపోయింది. ఓ వైపు మెసేజ్ ఇస్తూనే మరోవైపు మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా కొరటాల తెరకెక్కించాడు ఈ సినిమాను. మహేష్ బాబును అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా ఇందులో చూపించాడు శివ. కొరటాల శివ ఇచ్చిన సోషల్ మెసేజ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఊళ్లను దత్తత తీసుకున్నారు. ఈ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన “భరత్ అనే నేను” కూడా మంచి విజయం సాధించింది. మొత్తానికి శ్రీమంతుడు వచ్చి నాలుగేళ్ళు పూర్తి అవుతుండడంతో మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.

Related posts